AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మి హత్య కేసు: అఖిల్ ఒక్కడే నిందితుడు

ఏపీలోని గాజువాకలో ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మి హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే భౌతిక ఆధారాలను ల్యాబ్‌కి పంపిన పోలీసులు

వరలక్ష్మి హత్య కేసు: అఖిల్ ఒక్కడే నిందితుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 06, 2020 | 11:18 AM

Share

Varalakshmi murder case: ఏపీలోని గాజువాకలో ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మి హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే భౌతిక ఆధారాలను ల్యాబ్‌కి పంపిన పోలీసులు.. మిగిలిన కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసుపై మాట్లాడిన సీపీ మనీష్ కుమార్ సిన్హా.. వ్యక్తిగత కక్షతో అనుమానం పెంచుకుని వరలక్ష్మిని అఖిల్ హత్య చేసినట్లు తెలిపారు. (గౌతమ్‌తో తప్ప మరెవరితో నా జీవితాన్ని ఊహించుకోలేను: కాజల్‌)

హత్య జరిగిన రోజు సాయంత్రం గం.5.40ని.ల సమయంలో పలుసార్లు కాల్ చేసి అఖిల్‌, వరలక్ష్మిని పిలిచాడని, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం గం.6.10ని సమయంలో ఆమె కొండపైకి వెళ్లిందని తెలిపారు. ఇక 6.30 – 6.40 మధ్యలో హత్య జరిగినట్లు ఉందని పేర్కొన్నారు. ఈ హత్య జరిగిన సమయంలో మూడో వ్యక్తి ఎవరూ అక్కడ లేరని, నరబలి జరిగినట్లు అఖిల్ సీన్ క్రియేట్ చేయాలనుకున్నాడని ఆయన వివరించారు. ఈ కేసులో అఖిల్‌ తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడని మనీష్ కుమార్ పేర్కొన్నారు. ( కరోనా అప్‌డేట్స్‌.. దేశంలో కొత్త కేసులు ఎన్నంటే)

పట్టుబడిన తరువాత కూడా పారిపోయే ప్రయత్నం చేశాడని, 2 కిలోమీటర్లు ఛేజ్‌ చేసి మళ్లీ అఖిల్‌ని పట్టుకున్నట్లు తెలిపారు. మృతురాలి అన్నయ్య, నిందితుడు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. అఖిల్‌, వరలక్ష్మికి కూడా పరిచయం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో అఖిల్ ఒక్కడే నిందితుడుగా తమ విచారణలో తేలిందని.. మర్డర్ సెక్షన్‌తో పాటు పోక్సో సెక్షన్లు జోడించామని, త్వరలో చార్జ్ షీట్ వేస్తామని మనీష్‌ కుమార్ సిన్హా తెలిపారు. పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ట్రయల్ జరిపించి త్వరగా శిక్షపడేలా చూస్తామని వివరించారు. ( అంబులెన్స్‌కి దారి క్లియర్ చేసేందుకు 2కి.మీలు పరిగెత్తిన పోలీస్‌.. వీడియో వైరల్‌)