AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్, ఐదుగురు కూలీల పరిస్థితి విషమం!

నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ ఒకరి నిర్లక్ష్యానికి..ఐదుగురు ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది..మనోహరబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది...కాగా, అది ప్రమాదవశాత్తూ సిలిండర్ లీక్ అయ్యి ప్రమాదం జరిగింది అని అందరూ అనుకున్నారు..కానీ స్థానిక నివాసంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది అని పోలీసుల విచారణలో బయట పడింది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్, ఐదుగురు కూలీల పరిస్థితి విషమం!
Illegal Lpg Refilling
P Shivteja
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 5:53 PM

Share

నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ ఒకరి నిర్లక్ష్యానికి.. ఐదుగురు ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ ఘోర ప్రమాదం మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మనోహరబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అది సాధారణ సిలిండర్ లీకేజీ అని అందరూ భావించారు. కానీ, పోలీసుల ప్రాథమిక విచారణలో అసలు నిజం బయటపడింది. ఒక నివాస గృహంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుండి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్‌ను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

ఈ పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని రాజేష్, గంగారాం, సంజీవ్, లాలాన్, దబల్ నాథ్‌గా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బాధితులను మొదట కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా గాంధీ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న మనోహరబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, ధ్వంసమైన ఇళ్లను పరిశీలించి కేసు నమోదు చేశారు. జనాభా ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదకరమైన అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు ఎలా నడుస్తున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దందా వెనుక ఉన్న నిర్వాహకులను గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us