యూరప్తో దోస్తీకి కొత్త రూపు.. బెల్జియంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక డీల్!
భారతదేశం - బెల్జియం దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు సరికొత్త ఊపునిచ్చేందుకు గానూ మొట్టమొదటి 'భారత్-బెల్జియం వ్యూహాత్మక చర్చలు' అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ సహ-అధ్యక్షత వహించారు.

భారతదేశం – బెల్జియం దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలకు సరికొత్త ఊపునిచ్చేందుకు గానూ మొట్టమొదటి ‘భారత్-బెల్జియం వ్యూహాత్మక చర్చలు’ (India-Belgium Strategic Dialogue) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బెల్జియం ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ సహ-అధ్యక్షత వహించారు. ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య బంధాలను మరింత సంస్థాగతంగా, సమగ్రంగా, ఫలిత-ఆధారితంగా తీర్చిదిద్దుకోవడానికి ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి.
భారత్-ఈయూ సంబంధాలకు కొత్త వేదిక
ఈ వ్యూహాత్మక చర్చలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా.. విస్తృతమైన భారత్-యూరోపియన్ యూనియన్ (EU) వ్యూహాత్మక భాగస్వామ్య చట్రంలో క్రమబద్ధమైన రాజకీయ సంభాషణకు ఒక బలమైన వేదికగా ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, హరిత ఇంధన పరివర్తన, ఇన్నోవేషన్, సాంకేతికత, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ-భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి.
ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశానికి యూరప్తో ఉన్న భాగస్వామ్యంలో బెల్జియంకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని కొనియాడారు. ఇరు దేశాల పరస్పర బలాలను స్పష్టమైన ఫలితాలుగా మార్చడానికి ఈ సరికొత్త వ్యూహాత్మక చర్చలు ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా, మార్చి 2025 లో జరిగిన బెల్జియన్ ఎకనామిక్ మిషన్ సత్ఫలితాలను గుర్తుచేస్తూ.. బెల్జియం విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ఆర్థిక బంధాన్ని ప్రశంసించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు భవిష్యత్ సహకారానికి మరింత బలమైన పునాది వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరమ్
ఈ వ్యూహాత్మక చర్చలతో పాటు సమాంతరంగా ‘ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరమ్’ కూడా నిర్వహించారు. ఇందులో భారతదేశం, బెల్జియం సహా ఇతర ఐరోపా దేశాల ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్తో పాటు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద నేతృత్వం వహించారు. బెల్జియం తరపున ఫ్లాండర్స్ మంత్రి-అధ్యక్షుడు మథియాస్ డీపెండాల్, వలోనియా మంత్రి-అధ్యక్షుడు అడ్రియన్ డోలిమాంట్ హాజరయ్యారు.
ఎఫ్టీఏ (FTA) పై ప్రత్యేక దృష్టి
ముఖ్యంగా ప్రస్తుతం చర్చల దశలో ఉన్న భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో అందుబాటులోకి రానున్న సరికొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలపై బిజినెస్ ఫోరంలో సవివరంగా చర్చించారు. ఈ ఒప్పందం పూర్తయితే రెండు దేశాల మధ్య వాణిజ్యం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం ఉన్నత స్థాయి సమావేశాలు జరపాలని, అలాగే 2026 లో జరగబోయే ఉన్నత స్థాయి దౌత్య పర్యటనల ద్వారా కీలక కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మారుతున్న అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భవిష్యత్-ఆధారితంగా, దృఢంగా నిర్మించుకోవడానికి భారత్, బెల్జియం పునరుద్ఘాటించాయి.
Concluded a productive meeting of the India – EU Trade and Technology Council alongside CIM @PiyushGoyal, MoS MEITY @JitinPrasada and Principle Scientific Advisor Prof Ajay K Sood.
Thank EVP @HennaVirkkunen, Commissioners @EZaharievaEU and @MarosSefcovic, for their useful inputs… pic.twitter.com/9yI5qwZCYy
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
