AP Crime News: భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త.. హ‌త్య వెనుక కరోనా వ్య‌ధ‌.. వివ‌రాలు ఇవి

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను బ్లేడుతో కోసి దారుణంగా హ‌తమార్చాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం..

AP Crime News: భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త.. హ‌త్య వెనుక కరోనా వ్య‌ధ‌.. వివ‌రాలు ఇవి
murder
Follow us

|

Updated on: May 08, 2021 | 7:40 AM

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను బ్లేడుతో కోసి దారుణంగా హ‌తమార్చాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. సంక్లవారి తోట పరిధిలోని గోరింకపాలెం వీధిలో నివ‌శించే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో వారి పిల్లల్ని చుట్టాల ఇంటికి పంపి వారు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటూ మందులు వాడుతున్నారు. కాగా అనురాధకు ఒక్క‌సారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో 108, 104 వాహనాలకు సమాచారం అందించినా ఎవ‌రూ అక్క‌డికి రాలేదు. స్థానిక అధికారులకు స‌మాచారం ఇచ్చినా కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో మ‌న‌స్థాపానికి గురైన దంపతులు చనిపోవాల‌నుకున్నారు.

మద్యం సేవించిన మల్యాద్రి భార్య అనురాధపై ఇంట్లో ఉన్న బ్లేడుతో చేతిపై విచక్షణారహితంగా కోశాడు. అనంతరం తాను కూడా ఎడమ చేతి మణికట్టుపై కొంత మేర కోసుకొని బయటకు వెళ్లిపోయి.. .వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి విష‌యం చెప్పాడు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. ప‌రిశీలించ‌గా అప్పటికే అనురాధ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బంగారం ప్రియులకు షాక్‌.. పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

పెళ్లికి క‌రోనా ట‌చ్.. పీట‌ల మీద పెటాకులు… అసలు విష‌యం ఏంటంటే..?