ఏసీ ఆన్ చేసి పడుకుంటే ఏకంగా ప్రాణాలే పోయాయ్.. కొరియోగ్రాఫర్ ఎలా చనిపోయాడంటే..
వేసవిలో చల్లదనం కోసం వేసిన ఏసీ ఓ కొరియోగ్రాఫర్ ప్రాణం తీసింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఏసీ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న అతడు దట్టమైన పొగ పీల్చడంతో మృతి చెందిన సంఘటన పుష్పాలగూడలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో కొరియోగ్రాఫర్ మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్ రెడ్డి (38) కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. పుష్పాలగూడలోని శ్రీరాంనగర్ కాలనీలోని కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్ లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో ఏసీ ఆన్ చేసి పడుకున్నాడు. అయితే అర్దరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఏసీకి షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి గది మొత్తం పొగలు వ్యాపించాయి.
దీంతో గమనించిన చుట్టుపక్కలవారు డయల్ 100 ద్వారా పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పి ఇంట్లోకి వెళ్లగా.. అప్పటికే వీరేందర్ రెడ్డి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సీపీఆర్ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చడంతో వీరేందర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ఉస్మానియాకు తరిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ కారణాలను తెలపాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామన్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..