AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. ముగ్గురు చిన్నారులను చిదిమేసిన గోడ..

హైదరాబాద్ హబీబ్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. అఫ్జల్ సాగర్‌లోని మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరికొందరి చిన్నారులకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పునాదులు లేకుండా నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల […]

విషాదం.. ముగ్గురు చిన్నారులను చిదిమేసిన గోడ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 28, 2020 | 4:08 AM

Share

హైదరాబాద్ హబీబ్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. అఫ్జల్ సాగర్‌లోని మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరికొందరి చిన్నారులకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పునాదులు లేకుండా నిర్మించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల చిన్నారి పావనిగా గుర్తించారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us