AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Violence : ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ నేతపై ఎఫ్ఐఆర్.. పార్టీ నుంచి సస్పెండ్

దేశ రాజధాని ఢిల్లీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..వీరిలో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. కాగా.. కొందరు దుండగులు అంకిత్ శర్మాను అతి కిరాతకంగా హతమార్చారు. చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ […]

Delhi Violence : ఐబీ అధికారి హత్య కేసులో ఆప్ నేతపై ఎఫ్ఐఆర్.. పార్టీ నుంచి సస్పెండ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 27, 2020 | 11:13 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా..వీరిలో ఓ కానిస్టేబుల్‌తో పాటుగా.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. కాగా.. కొందరు దుండగులు అంకిత్ శర్మాను అతి కిరాతకంగా హతమార్చారు.

చాంద్‌బాగ్ ప్రాంతంలో అంకిత్ శర్మ ఓ కాలువలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా దేశరాజధానిలో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. ఈ ఘటనలో ఆప్ నేత, కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంకిత్ శర్మ హత్య కేసులో.. తాహిర్ హుస్సేన్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఐపీసీ 302 కింద (హత్యకేసు)గా దయాల్ పూర్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. అధికారులు తొలుత రాళ్లదాడిలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావించినా.. అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు మాత్రం.. ఆప్ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్‌ సహా.. మరికొందరు శర్మను హతమార్చారని ఆరోపించారు. మరోవైపు ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని.. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.

మరోవైపు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాహీర్ హుస్సేన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంకిత్ శర్మ హత్య కేసులో ఆరోపణలు రావడంతో పాటు ఆయనపై కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ చాంద్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం కేంద్రాలుగా మారినట్లు పోలీసులు పక్కా ఆధారాలను సేకరించారు. తాహిర్ నివాసంపైకెక్కిన వందలాది మంది ఆందోళనకారులు..పెట్రోల్, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలను సేకరించారు.