కొంపల్లిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఎమ్‌ఎల్‌ఆర్ కాలేజీ హాస్టల్ పక్కనే మ‌ృతదేహం గుర్తింపు

Student Death in Kompally : హైదరాబాద్ పరిధిలోని కొంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రిక అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది.

కొంపల్లిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఎమ్‌ఎల్‌ఆర్ కాలేజీ హాస్టల్ పక్కనే మ‌ృతదేహం గుర్తింపు
Crime News
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 23, 2021 | 11:04 AM

Student Death in Kompally : హైదరాబాద్ పరిధిలోని కొంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రిక అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఎంఎల్‌ఆర్ కాలేజీ హాస్టల్ పక్కనే మ‌ృతదేహాన్ని గుర్తించారు. ఒంటిపై గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా అనుమానం వ్యక్తంచేస్తున్నారు.మేడ్చల్‌ జిల్లాలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక అనుమానాస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.

కాలేజీ దగ్గరలో ఉండే కృప హాస్టల్‌లో ఉంటుంది. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో గాని ఉదయానికి అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఇదిలా ఉంటే భవనం పైనుంచి దూకి చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. మృతదేహం పడి ఉన్న స్థలం నిర్మానుష్యంగా ఉంది. కూతవేటు దూరంలో భవనాలు ఉన్నాయి. అయితే భవనంపై నుంచి పడితే మృతదేహం ఇక్కడకు ఎలా వచ్చి పడిందనేది అంతుచిక్కకుండా ఉంది. కాగా చంద్రిక స్వస్తలం మిర్యాలగూడగా చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Telangana Assembly Sessions Live Updates: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నైట్‌ కర్ఫ్యూపై ప్రకటించే ఛాన్స్‌.

మీ ఆధార్ కార్డులు ఇతరులు వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. తెలుసుకోండి ఇలా..

Crime News: అనుమానపు రాక్షసుడు.. భార్య పట్ల ఒళ్లు గగురుపరిచేలా ప్రవర్తించిన భర్త…

China Sichuan Province : మూడు వేల క్రితం నాటి బంగారు వస్తువులు, కళాఖండాలు వెలుగులోకి.. వీటి విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే..