AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఒకే మహిళతో అన్నదమ్ముల అక్రమ సంబంధం.. చివరికి ఊహించని విషాదం

అక్రమ సంబంధాల మోజులో కొందరు పెడదారి పడుతున్నారు. క్షణికమైన సుఖం కోసం కుటుంబ బంధాలను నాశనం చేసుకుంటున్నారు.

Telangana: ఒకే మహిళతో అన్నదమ్ముల అక్రమ సంబంధం.. చివరికి ఊహించని విషాదం
ఒకే మహిళతో అన్నదమ్ముల అఫైర్
Ram Naramaneni
|

Updated on: Dec 06, 2021 | 4:54 PM

Share

అక్రమ సంబంధాల మోజులో కొందరు పెడదారి పడుతున్నారు. క్షణికమైన సుఖం కోసం కుటుంబ బంధాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల వల్ల పచ్చని కాపురాలు నిట్టనిలువునా కుప్పకూలిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇల్లీగల్ అఫైర్.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. రెబ్బెన మండలంలోని నవేగాంకు చెందిన వేల్పుల ఇందూర్‌(18), రాజలింగు ఇద్దరూ బ్రదర్స్ అవుతారు. అంటే వీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలు అనమాట. ఇందూర్‌‌కు కొంతకాలం క్రితం ఓ మహిళతో…  ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళతో రాజలింగుకు చాన్నాళ్ల నుంచి సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అతడు పద్ధతి మార్చుకోవాలని, ఆ మహిళకు దూరంగా ఉండాలని ఇందూర్‌ను చెప్పి చూశాడు. మాట వినకపోవడంతో గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయిన్ప్పటికీ ఇందూర్.. రాజలింగు మాటలను పెడచెవిన పెట్టాడు. సదరు మహిళతో సంబంధం కొనసాగించాడు. దీంతో సోదరుడ్ని అంతం చేయాలని రాజలింగు డిసైడ్ అయ్యాడు.

ఈనెల 1న సాయంత్రం ఇంటి ఎదుట ఉన్న గొడ్ల చావడిలో ఇందూర్‌ కాళ్లు, చేతులు కడుక్కుంటూ ఉండగా గమనించిన రాజలింగు..  కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు.  కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమై కిందపడిపోగా వెంటనే కర్రతో తలపై బలంగా మోదడంతో ఇందూర్‌ స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి తండ్రి మధునయ్య కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజలింగును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read: వాతావరణం కంటే వేగంగా మారుతోన్న టమాట ధర.. మరోసారి మోత పుట్టిస్తోంది

నెట్టింట తెగ వైరల్ అవుతోన్న చైతన్య, సమంతల ఓల్డ్ ఫోన్ కాల్…