Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?

PT Master kidnap Student:  అతనొక ప్రభుత్వ పీటీ మాస్టర్.. చివరకు తన హోదాను మరిచాడు.. కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్

Kidnap Case: స్టూడెంట్‌ను కిడ్నాప్ చేసిన పీటీ సార్.. ఆపై పెళ్లి చేసుకునేందుకు ప్లాన్.. చివరకు ఏమైందంటే..?
Kidnap Case
Follow us

|

Updated on: Apr 13, 2021 | 3:39 PM

PT Master kidnap Student:  అతనొక ప్రభుత్వ పీటీ మాస్టర్.. చివరకు తన హోదాను మరిచాడు.. కీచకంగా వ్యవహరించాడు. ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని మత్తూరు సమీపంలో జరిగింది. దీంతో విద్యార్థినిని కిడ్నాప్‌ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
కృష్ణగిరి జిల్లా మత్తూర్‌ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (16) ప్లస్‌ వన్‌ చదువుతోంది. ఈ మేరకు ఆమె తిరువణ్ణామలై జిల్లా మేల్‌ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్‌ మిషన్‌ మెట్రిక్యూలేషన్‌ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆ విద్యార్థిని ఈ నెల 9వ తేదీన అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు కావ్య,మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో తిరువన్నామలై నాగనూర్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్‌ రాజ్‌ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసినట్లు వెల్లడైంది. దీంతో మత్తూరు పోలీసులు ఆదివారం చరణ్‌ రాజ్‌ను అరెస్టు చేశారు. అనంతరం బాలికను  తల్లిదండ్రులకు అప్పగించారు.
Also Read: