AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఆంధ్రా – కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం..

Karnataka Road Accident: ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది దుర్శరణం చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: ఆంధ్రా - కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం..
Road Accident
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 19, 2022 | 5:50 PM

Share

Karnataka Road Accident: ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది దుర్శరణం చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వైఎన్ హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలవలహళ్లి దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. బస్సులో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారంతో పోలీసులు, అధికారులు సైతం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు.

అయితే ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బస్సు టాప్‌పై సైతం డిగ్రీ విద్యార్థులున్నట్లు పేర్కొంటున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సు టాప్‌పై ఉన్న వారు దూకినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

AP Crime News: చిన్నాన్నే హంతకుడు.. అక్రమ సంబంధం బయటపడుతుందని బాలుడిని దారుణంగా..

Vultures: ఒకేసారి వంద రాబందుల మృతి.. ప్రాణాపాయ స్థితిలో మరికొన్ని.. అసలేమైందంటే..