AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: బర్త్ డే పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు.. నమ్మి వెళ్తే స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు

పుట్టినరోజు పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెతో సరదాగా ఫొటో దిగాడు. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని దారుణంగా పాల్పడ్డాడు. అతనే కాకుండా తన స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా వీడియో తీసి మిగతా...

Tamil Nadu: బర్త్ డే పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు.. నమ్మి వెళ్తే స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు
Harassment
Ganesh Mudavath
|

Updated on: Jul 10, 2022 | 11:02 AM

Share

పుట్టినరోజు పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెతో సరదాగా ఫొటో దిగాడు. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని దారుణంగా పాల్పడ్డాడు. అతనే కాకుండా తన స్నేహితులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా వీడియో తీసి మిగతా ఫ్రెండ్స్ కూ షేర్ చేశాడు. వాళ్లూ బాలికను వేధించడం మొదలు పెట్టారు. వారి వేధింపులు తాళలేక బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తమిళనాడులోని (Tamil Nadu) కడలూరు జిల్లాకు చెందిన బాలిక చెన్నైలోని (Chennai) ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే స్కూల్​లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి బాలిక కూడా వెళ్లింది. కేక్ కట్ చేసే సమయంలో యువకుడు ఆ బాలికతో కలిసి ఫొటో దిగాడు. ఆ ఫొటో తీసుకునేందుకు ఇంటికి రావాలని కోరాడు. అతని మాటలు నమ్మి ఇంటికి వెళ్లిన బాలికపై యువకుడు, అతని ఇద్దరు స్నేహితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతే కాకుండా దారుణాన్ని సెల్​ఫోన్ లో వీడియో తీశారు. ఆ వీడియోను మిగతా స్నేహితులకు పంపించాడు. దాన్ని చూసిన మరో వ్యక్తి.. వీడియో సహాయంతో బాధితురాల్ని బెదిరించాడు. వారి వేధింపుతులు తాళలేక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. వెంటనే అప్రమత్తమైన ఆమె ఘటనపై స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద నలుగురినీ అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

క్రైం వార్తల కోసం.. ఈ లింక్ క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం