AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం…గుండెపోటుతో యువ‌న‌టుడు మృతి

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. కొలీవుడ్‌లో చిన్నచిన్న సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న..

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం...గుండెపోటుతో యువ‌న‌టుడు మృతి
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 2:46 PM

Share

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. కొలీవుడ్‌లో చిన్నచిన్న సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సేతురామన్ గుండెపోటుతో మృతి చెందాడు. సేతు రామన్ మృతితో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. సేతూరామ్ హీరోగా కన్న లడ్డు తిన్న ఆసయా సినిమాలో కీలక పాత్రలో నటించాడు. 2013లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అందులో సేతు రామన్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వాలిబా రాజా (2016), సక్కా పోడు పోడు రాజా (2017), 50/50 (2019) లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప‌లువురు త‌మిళ న‌టీన‌టులు సంతాపం వ్యక్తం చేశారు.