AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ట్యూషన్‌కు వెళ్తుండగా డ్రగ్స్ ఇచ్చి..

Student Gang-raped in UP: నేరాలకు, మహిళలపై అఘాయిత్యాలకు కేరాప్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి

Crime News: మరో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ట్యూషన్‌కు వెళ్తుండగా డ్రగ్స్ ఇచ్చి..
rape case
Shaik Madar Saheb
|

Updated on: Dec 26, 2021 | 11:27 AM

Share

Student Gang-raped in UP: నేరాలకు, మహిళలపై అఘాయిత్యాలకు కేరాప్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం ట్యూషన్ వెళ్లింది. ఈ క్రమంలో అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు డ్రగ్స్ ఇచ్చారు. అనంతరం బాధితురాలిని సాద్‌పుర్‌ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు వీరికి తోడయ్యారు. ఆ తర్వాత నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. బాలిక రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా.. అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని గుర్తించారు. అనంతరం ఆమెను ఆసుపపత్రికి తరలించి చికిత్స అందించారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత విద్యార్థిని తనపై జరిగిన దారుణం గురించి ఆమె కుటుంబసభ్యులకు వివరించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు జనసత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బబ్లూ సింగ్ వర్మ పేర్కొన్నారు.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే.. బాలికకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని.. నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. హాస్టల్‌ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బలవన్మరణం.. 

Kidnap: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన.. ఇంటి ముందు చలికాచుకుంటున్న బాలిక.. ఇంతలోనే..

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!