AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ఆమె శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో మహిళా ఉద్యోగి. 18 ఏళ్ల నుంచి జాబ్ చేస్తోంది. ఈవిడగారి ప్రవర్తనపై తొలినాళ్ల నుంచి అధికారులకు కంప్లైంటులు అందుతూనే ఉన్నాయి

ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది... ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2021 | 10:12 AM

Share

ఆమె శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో మహిళా ఉద్యోగి. 18 ఏళ్ల నుంచి జాబ్ చేస్తోంది. ఈవిడగారి ప్రవర్తనపై తొలినాళ్ల నుంచి అధికారులకు కంప్లైంటులు అందుతూనే ఉన్నాయి. లంచం ఇవ్వకపోయే మేడమ్ గారు ఏ ఫైల్ ముందుకు పంపరని టాక్. దీంతో ఉన్నతాధికారులు ఆఫీస్‌లో సీసీ కెమెరాలు పెట్టించారు. అయితే అవి ఉంటే కార్యాలయంలో లంచం తీసుకోవడానికి ఉద్యోగులు భయపడతారు. కానీ ఈవిడగారు మాత్రం సీసీ కెమెరాలకు చూపించి మరీ లంచం తీసుకుని.. ఆపై సస్పెండ్ అయ్యింది. ఆ వివరాలు ఏవో చూద్దాం పదండి.

వివరాల్లోకి వెళ్తే..  శ్రీకాకుళం జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో ఓ అధికారిణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం ఆమె సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకోవడమే. ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి 18 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆమె పని తీరుపై విమర్శలు రావడంతో ఇటీవల అధికారులు సీసీ కెమెరాలు పెట్టించారు కూడా. ఇటీవల ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:

Photographer overaction: ఈ వీడియో చూస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం.. అతికి అదిరిపోయే దెబ్బ

దేహమే మందిరం.. ఒళ్లంతా పచ్చ బొట్లు.. ఆ తెగ పలుకులోనూ, పనిలోనూ నిత్యం మర్యాదా పురుషోత్తముడే