AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రైమ్ రికార్డ్స్: సగటున ఒక్క రోజునే 91 అత్యాచారాలు!

సగటున ఒక్క రోజులో భారతదేశం మొత్తం మీద 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయట. 2018లో దేశంలో జరిగిన నేరాలపై.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో కఠోరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 2018లో మొత్తం మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ కాగా.. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో వెల్లడించింది. కాగా.. దేశం […]

క్రైమ్ రికార్డ్స్: సగటున ఒక్క రోజునే 91 అత్యాచారాలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 10, 2020 | 10:07 PM

Share

సగటున ఒక్క రోజులో భారతదేశం మొత్తం మీద 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్‌లు నమోదవుతున్నాయట. 2018లో దేశంలో జరిగిన నేరాలపై.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో కఠోరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 2018లో మొత్తం మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ కాగా.. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మాత్రం తగ్గిందని ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో వెల్లడించింది.

కాగా.. దేశం మొత్తం మీద వేర్వేరు కారణాల వల్ల సుమారు 1.34 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నవారు 7.7 శాతమని గణాంకాలు తెలిపాయి. అయితే 2017 సంవత్సరం నాటి రైతుల ఆత్మహత్యలతో పోల్చితే 2018లో 3.6 శాతం ఎక్కువ అయ్యాయట. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారిలో గతేడాది సుమారు 10,349 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.

అలాగే.. దేశవ్యాప్తంగా రోజుకి 91 మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో దాదాపు మైనర్లే ఉండటం అమానుషం. అయితే.. అభం శుభం తెలియని చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా అత్యాచారానికి గురవుతున్నారట. 2018లో అత్యాచారాలు 51.9 శాతం పెరిగాయట. ఇక రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయేవారి సంఖ్య 2018లో 30.3 శాతం పెరిగిందట.

ఇకపోతే ఇతరులతో వివాదాల కారణంగా అత్యధిక హత్యలు జరిగినట్టు క్రైమ్ రికార్డు నివేదిక పేర్కొంది. 2018లో 29,017 హత్య కేసులు నమోదు కాగా.. ఇది 2017లో 1.7 శాతం అధికమని నివేదిలో పేర్కొన్నారు నిర్వాహకులు. వ్యక్తిగత ద్వేషం, పగ, లాభాపేక్ష వంటి కారణాలతో 2018లో 6,875 మంది హత్యకు గురయ్యారు. కాగా.. కిడ్నాపింగ్, ఎత్తుకెళ్లడం వంటి నేరాల సంఖ్య 2018లో ఎక్కువైంది. 2017లో మొత్తం 95,893 కిడ్నాప్ కేసులు నమోదవ్వగా.. 2018లో ఈ సంఖ్య 10.3 శాతం పెరిగింది.