AP CM Relief Fund Scam: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. ఇలా స్కామ్ చేశారు

ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌ స్కామ్‌లో అసలు నిందితులు ఎవరో తేలిపోయింది. నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్టు అధికారులు గుర్తించారు.

AP CM Relief Fund Scam: కదులుతోన్న డొంక.. ప్రధాన నిందితులు అరెస్ట్.. ఇలా స్కామ్ చేశారు
Ap Cmrf Fund Scam
Follow us

|

Updated on: Sep 23, 2021 | 6:56 PM

ఏపీలో సీఎంఆర్‌ఎఫ్‌ స్కామ్‌ సంచలనం రేపింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు 2014 నుంచి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. సచివాలయ సిబ్బందే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఏసీబీ అధికారులు తేల్చారు. మొత్తం 88 నకిలీ క్లెయిమ్‌లను గుర్తించారు. 60 లక్షల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేల్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 409, 420, 468, 471 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 21న కేసు రిజిస్టర్‌ చేశారు ఏసీబీ అధికారులు. పేదల డేటా సేకరించి సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ స్కామ్‌లో 50 మంది ప్రమేయం ఉన్నట్టు మొదట భావించారు. ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్రపైనా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అయితే నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేశారు.

తప్పుడు పేర్లు, తప్పుడు పత్రాలతో CMRF నిధులు నొక్కేసినట్లు తేల్చారు ఏసీబీ అధికారులు. CMRFలో అక్రమాలు జరిగినట్లు అధికారుల ఫిర్యాదుతో ఏసీబీ విచారణ జరిపింది. CMRFలాగిన్ ఐడీ, పాస్ వర్డ్‌లని సేకరించి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు క్లెయిమ్స్‌తో నిధులు దిగమింగినట్లు గుర్తించారు. సచివాలయంలో పనిచేసే చలువాడి సుబ్రమణ్యం, సోక రమేశ్‌లతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు చదలవాడ మురళీ కృష్ణ, ధన్‌రాజును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేస్తోన్న 50 మందిని పూర్తిస్థాయిలో విచారించింది ఏసీబీ. దీంతో CMRF కేసులో ఎప్పుడు, ఎవరిని అరెస్ట్ చేస్తారో అని సచివాలయ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఏడేళ్లుగా అక్రమాలు జరిగాయని తేలయడంతో ఈ కేసులో ఇంకా ఎంత మంది ప్రమేయం ఉంది ? ఎన్ని నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు నొక్కేశారో ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ కేసు దర్యాప్తు చేసినకొద్దీ నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read:  హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్.. కీలక ప్రకటన

 భార్య ఉండనని చెప్పి పుట్టింటికి వెళ్లింది.. అతడి షాకింగ్ నిర్ణయంతో, జీవితాలు అస్తవ్యస్తం

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు