AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వనపర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..

Three students killed: తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. వనపర్తి (wanaparthy) పట్టణంలోని

Telangana: వనపర్తిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2022 | 9:30 AM

Share

Three students killed: తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. వనపర్తి (wanaparthy) పట్టణంలోని బండార్‌నగర్‌కు చెందిన ఎండి మున్నా (16), ఎండి అజ్మత్ (16), ఏర్పుల భరత్ (17) పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువు దగ్గరకు వెళ్లారు. అనంతరం ఈత (swimming ) కొట్టేందుకు చెరువులో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కూడా చెరువులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనపర్తి పోలీసులు తెలిపారు. చేతికొచ్చిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Viral Video: అబ్బ నాతో అంత ఈజీ కాదు..! గుర్రం దెబ్బకు పిల్లి విలవిల.. వీడియో వైరల్

AP Crime News: అయ్యో పాపం.. చిన్నారి ప్రాణం తీసిన చైన్ స్నాచర్.. తెల్లవారుజామునే మాటువేసి..