AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడి వారిని రప్పించండి.. కేంద్ర మంత్రికి వైసీసీ ఎంపీ లేఖ..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్ధులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని మనిలాలో భారతీయ విధ్యార్ధులు దాదాపు 180 మంది అక్కడి ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు గాస్తున్నారు. వీరిలో విశాఖ జిల్లాకు చెందిన 30 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని..ఎలాగైన తమను భారత్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై అరకు ఎంపీ మాధవి […]

అక్కడి వారిని రప్పించండి.. కేంద్ర మంత్రికి వైసీసీ ఎంపీ లేఖ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2020 | 7:49 PM

Share

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్ధులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్‌లోని మనిలాలో భారతీయ విధ్యార్ధులు దాదాపు 180 మంది అక్కడి ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు గాస్తున్నారు. వీరిలో విశాఖ జిల్లాకు చెందిన 30 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని..ఎలాగైన తమను భారత్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై అరకు ఎంపీ మాధవి విదేశాంగా మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు.ఫిలిప్పీన్స్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.