AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఉచిత చికిత్స… దీదీ

కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా చికిత్సలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఉచిత చికిత్స... దీదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 7:38 PM

Share

కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా చికిత్సలు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేసిన రోగులను ప్రైవేటు హాస్పిటల్స్ తిరస్కరించరాదని, అన్ని ఆసుపత్రులూ ‘రోగులకు ఉచిత చికిత్స..మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది’ అన్న నోటీసును ప్రముఖంగా ప్రదర్శించాలని  (డిస్ ప్లే చేయాలని)   కూడా ఈ ఉతర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రోజువారీ కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని  మమతా బెనర్జీ సర్కార్ నిర్ణయించింది. రేషన్ షాపులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి మే 31 వరకు అమలులో ఉంటాయి.