AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 patient: మధ్యప్రదేశ్‌లో అమానుషం.. కరోనా బాధితుడిని చితకబాదిన పోలీసులు.. వీడియో..

Attack on Covid-19 Patient: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో దారుణ సంఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు కలిసి క‌రోనా రోగిని చిత‌క‌బాదారు. దీంతో

Covid-19 patient: మధ్యప్రదేశ్‌లో అమానుషం.. కరోనా బాధితుడిని చితకబాదిన పోలీసులు.. వీడియో..
Attack On Covid 19 Patient Mp
Shaik Madar Saheb
|

Updated on: Apr 12, 2021 | 10:09 AM

Share

Attack on Covid-19 Patient: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో దారుణ సంఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు కలిసి క‌రోనా రోగిని చిత‌క‌బాదారు. దీంతో ఆ ఇద్దరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘ‌ట‌న ఖండ్వాలోని చైగావ్ మఖన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిర్సోడ్ బంజారీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ షేర్ చేసి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు పలువురు కూడా ఈ వీడియోపై స్పందించడంతో.. పోలీసులు దీనిపై స్పందించారు.

సిర్సోడ్ బంజరీ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ క్రమంలో కరోనా రోగిని ఆసుపత్రికి త‌ర‌లించేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. దీంతో కరోనా రోగి కుటుంబసభ్యులు అతిన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆరోగ్య సిబ్బంది, వారి మధ్య మాటమాట పెరిగింది. రోగి బంధువులు సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బంధీగా ఉంచారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఖండ్వాలోని కరోనా రోగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులను సముదాయిస్తున్న తరుణంలో రోగి కుటుంబం పోలీసులపై కూడా దాడి చేయడం ప్రారంభించిందని ఖండ్వా సుపరింటెండెంట్ వెల్లడించారు. దీంతో ప్రతీకారంగా క‌రోనా రోగితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు కొట్టారని వెల్లడించారు.

భీమ్ ఆర్మీ చీఫ్ షేర్ చేసిన వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా.. ఈ వీడియోల‌పై ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. క‌రోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు వెల్లడించారు. దీంతోపాటు ఆరోగ్య సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన కరోనా రోగి కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు వివేక్ సింగ్ తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

Also Read:

Haridwar Kumbh 2021: హరిద్వార్‌లో పోటెత్తిన భక్తులు.. కనిపించని కోవిడ్ నిబంధనలు.. అధికారుల్లో ఆందోళన

మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ ఉందా..! అయితే SBI లెక్కలు తెలుసుకోవాల్సిందే.. లేదంటే కష్టమే..?

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!