టికెట్ బుకింగ్స్ డిలే.. రైల్వే శాఖ ‘సారీ’!
రైల్వే టికెట్ బుకింగ్స్ కాస్త ఆలస్యమైనందుకు చింతిస్తున్నామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఐ ఆర్ సీ టీ సీ వెబ్ సైట్ కొంతసేపు క్రాష్ అయింది. అయితే కొద్దిసేపటికే అది పని చేయడం ప్రారంభించింది. సెలెక్ట్ చేసిన రైలు సర్వీసులకు బుకింగ్ ని ఆన్ లైన్ ద్వారా లాంచ్ చేసిన విషయం విదితమే.. అయితే కొంత జాప్యం జరిగినందుకు చింతిస్తున్నట్టు ఈ శాఖ పేర్కొంది. ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ […]
రైల్వే టికెట్ బుకింగ్స్ కాస్త ఆలస్యమైనందుకు చింతిస్తున్నామని రైల్వే శాఖ పేర్కొంది. ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఐ ఆర్ సీ టీ సీ వెబ్ సైట్ కొంతసేపు క్రాష్ అయింది. అయితే కొద్దిసేపటికే అది పని చేయడం ప్రారంభించింది. సెలెక్ట్ చేసిన రైలు సర్వీసులకు బుకింగ్ ని ఆన్ లైన్ ద్వారా లాంచ్ చేసిన విషయం విదితమే.. అయితే కొంత జాప్యం జరిగినందుకు చింతిస్తున్నట్టు ఈ శాఖ పేర్కొంది. ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవాలని రైల్వే వర్గాలు ప్రయాణికుల్ని కోరాయి. మంగళవారం నుంచి సెలక్ట్ చేసిన ప్యాసింజర్ రైళ్లు నడవనున్నాయి.