టీఎస్ సర్కార్ మరో సంచలన నిర్ణయం..? తెల్లకార్డు రద్దైనా..
ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో... దాదాపు 8 లక్షల తెల్ల రేషన్ కార్డులు... తిరిగి యాక్టివ్ అవుతాయని తెలుస్తోంది. వారి కార్డుల్ని యాక్టివ్ చేసి... సాయం అందించే ఆలోచనలో..
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉండి అమలులో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం చూపించింది. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులు నాలుగైదు నెలలుగా సబ్సిడీ బియ్యం తీసుకోకపోతే..వారి కార్డులు ఆటోమెటిక్గా నిలిచిపోతాయనే సంగతి తెలిసిందే. వరుసగా మూడు నెలలుగా రేషన్ సరుకుల కోసం వేలి ముద్రలు వెయ్యని కార్డుల నెంబర్లు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. అలా కార్డు పనిచేయని స్థితిలో రేషన్ అందక..కరోనా కాలంలో ఆ కుటుంబాలన్నీ తీవ్ర దీనావస్థలో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని… అలా తెల్ల రేషన్ కార్డు రద్దైన కుటుంబాలకు కూడా సాయం అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది.
ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో… దాదాపు 8 లక్షల తెల్ల రేషన్ కార్డులు… తిరిగి యాక్టివ్ అవుతాయని తెలుస్తోంది. వారి కార్డుల్ని యాక్టివ్ చేసి… సాయం అందించే ఆలోచనలో ఉందని తెలిసింది. ప్రభుత్వం బ్లాక్ చేసిన తెల్ల రేషన్ కార్డుల్ని తిరిగి యాక్టివ్ చేస్తే… వాటికి… జూన్ నుంచి బియ్యం, డబ్బులు అందే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయబోతోందని తెలిసింది.