ఐసోలేషన్ వార్డులో క‌రోనా సోకిన యువతి టిక్‌టాక్‌..మరో ముగ్గురికి షాక్

టిక్‌టాక్ పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లింది అన‌టానికి ఇది చ‌క్క‌టి నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఓ యువ‌తి క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొంతున్న‌ప్ప‌టికీ టిక్‌టాక్‌ను వ‌దులుకోలేదు. ఐసోలేష‌న్ వార్డులోనే మ‌రో ముగ్గురు సిబ్బందితో క‌లిసి టిక్‌టాక్ వీడియో చేసింది.

ఐసోలేషన్ వార్డులో క‌రోనా సోకిన యువతి టిక్‌టాక్‌..మరో ముగ్గురికి షాక్
Follow us

|

Updated on: Apr 01, 2020 | 3:24 PM

టిక్‌టాక్ పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లింది అన‌టానికి ఇది చ‌క్క‌టి నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఓ యువ‌తి క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొంతున్న‌ప్ప‌టికీ టిక్‌టాక్‌ను వ‌దులుకోలేదు. ఐసోలేష‌న్ వార్డులోనే మ‌రో ముగ్గురు సిబ్బందితో క‌లిసి టిక్‌టాక్ వీడియో చేసింది. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో ఆమె చేసిన ప‌నికి నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆస్ప‌త్రి సిబ్బంది,.. అధికారుల‌కు మాత్రం కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెట్టింది. వివ‌రాల్లోకి వెళితే…
త‌మిళ‌నాడులోని అరియలూర్ జిల్లాకు చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. ఎప్పుడూ బీజీగా ఉంటుంది. ఇటీవల ఆమె జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. టెస్టులు చేసిన వైద్యులు క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధారించారు. మార్చి 26నుంచి ఆమెను అరియలూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఐసోలేషన్ వార్డులో ఉన్న బాధిత మహిళ మార్చి 28న టిక్‌టాక్ వీడియో చేసింది. ఓ బాధాకరమైన పాటను ఎంచుకొని కరోనాతో తాను ఎలాంటి తిప్పలు పడుతున్నానో వివరించింది.
ఒంటరిగా ఉండటంతో ఏమీ తోచటం లేదు.. అభిమానులను ఎంత‌గానో మిస్సవుతున్నాను అంటూ..ఆ యువతి తన టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది. దగ్గు కారణంగా ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో పండ్లు, కోడి గుడ్లు అందిస్తున్నారని.. గొంతు నొప్పి కారణంగా ఏమీ తినలేకపోతున్నానని ఆమె తన ఫాలోవర్లకు తెలిపింది. అయితే, ఆ వీడియో చేయడానికి వార్డులోని ముగ్గురు సిబ్బంది కూడా సహకరించారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెకు సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వారిని కూడా వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.