AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా బులిటెన్ః త‌మిళ‌నాడులో కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే?

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్ర […]

క‌రోనా బులిటెన్ః త‌మిళ‌నాడులో కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 27, 2020 | 7:17 PM

Share

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కేసులతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే నిత్యం పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూనే ఉంటున్నారు. ఇక కేసుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలోకి చేరింది భారత్. అటు, తమిళనాడులో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5,981 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 109 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,242కి, మరణాల సంఖ్య 6,948కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 5870 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,43,930 మంది కోలుకోగా, ప్రస్తుతం 52,364 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

Read More:

ఆదిపురుష్ ప్రాజెక్ట్: ఇంటివ‌ద్ద‌నే విలువిద్య నేర్చుకుంటోన్న ప్ర‌భాస్‌?

కోమాలోనే ప్ర‌ణ‌బ్.. కిడ్నీ స‌మ‌స్య‌లు కూడా తలెత్తాయిః ఆస్ప‌త్రి వైద్యులు

క‌రోనా టెస్టుల ధ‌ర‌ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

బ్రేకింగ్ః గాంధీ ఆస్ప‌త్రి నుంచి న‌లుగురు ఖైదీలు ప‌రారీ

మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు