AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలసకూలీలను ఆపలేమన్న సుప్రీంకోర్టు

కరోనా పుణ్యమంటూ.. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఉన్న ఊరు నుంచి సొంతూరికి పయనమయ్యారు. వలస వెళ్తున్నవారిని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఎవ‌రు న‌డుచుకుంటూ వెళ్తున్నారు, ఎవ‌రు వెళ్ల‌డం లేద‌న్న విష‌యాన్ని స‌మీక్షించ‌డం కోర్టుకు కుద‌ర‌ని ప‌ని ధ‌ర్మాస‌నం తేల్చేసింది. వ‌ల‌స కూలీల న‌డ‌క అంశాన్ని రాష్ట్రాలు చూసుకుంటాయని.. దీంట్లో కోర్టు ప్ర‌మేయం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని ధ‌ర్మాస‌నం వినిపించింది. రోడ్డు మార్గంలో వ‌ల‌స వెళ్తున్న కూలీల‌ను గుర్తించి, వారికి ఆహారం, ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని అలోక్ […]

వలసకూలీలను ఆపలేమన్న సుప్రీంకోర్టు
Pardhasaradhi Peri
|

Updated on: May 15, 2020 | 2:16 PM

Share

కరోనా పుణ్యమంటూ.. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక ఉన్న ఊరు నుంచి సొంతూరికి పయనమయ్యారు. వలస వెళ్తున్నవారిని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఎవ‌రు న‌డుచుకుంటూ వెళ్తున్నారు, ఎవ‌రు వెళ్ల‌డం లేద‌న్న విష‌యాన్ని స‌మీక్షించ‌డం కోర్టుకు కుద‌ర‌ని ప‌ని ధ‌ర్మాస‌నం తేల్చేసింది. వ‌ల‌స కూలీల న‌డ‌క అంశాన్ని రాష్ట్రాలు చూసుకుంటాయని.. దీంట్లో కోర్టు ప్ర‌మేయం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని ధ‌ర్మాస‌నం వినిపించింది. రోడ్డు మార్గంలో వ‌ల‌స వెళ్తున్న కూలీల‌ను గుర్తించి, వారికి ఆహారం, ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని అలోక్ శ్రీవాత్స‌వ కోర్టులో పిటిష‌న్ వేశారు. వ‌ల‌స కూలీల ప‌ట్ల కేంద్రం చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశించాలని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర‌లో ఇటీవ‌ల రైలు ప‌ట్టాల‌పై 16 మంది చ‌నిపోయిన ఘ‌ట‌న‌ను ఆయ‌న త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు. వ‌ల‌స కూలీలు, న‌డుచుకుంటూ వెళ్లేవారు ఆగ‌డం లేద‌ని, వారిని మేం ఎలా ఆప‌గ‌ల‌మ‌ని కోర్టు ఈ సంద‌ర్భంగా పేర్కొన్న‌ది. రైల్వే ట్రాక్‌ల‌పై నిద్రించే వారిని ఎవ‌రు ర‌క్షిస్తార‌ని మ‌హారాష్ట్ర కేసులో కోర్టు అభిప్రాయ‌ప‌డింది.