కోలుకున్న బీజేపీ అధికారిక ప్రతినిధి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
కరోనా మహమ్మారి లక్షణాలతో ఆస్పత్రిపాలైన బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎట్టకేలకు కోలుకున్నారు. రెండు వారాల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో.. గుర్గ్రామ్లోని మేదాంతా ఆస్పత్రిలో చేరారు. రెండు వారాల పాటు చికిత్స తీసుకున్న అనంతరం.. సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం నాడు ఆయన తన అధికారిక ట్విట్టర్లో తన ఆరోగ్య సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. […]
కరోనా మహమ్మారి లక్షణాలతో ఆస్పత్రిపాలైన బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎట్టకేలకు కోలుకున్నారు. రెండు వారాల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో.. గుర్గ్రామ్లోని మేదాంతా ఆస్పత్రిలో చేరారు. రెండు వారాల పాటు చికిత్స తీసుకున్న అనంతరం.. సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం నాడు ఆయన తన అధికారిక ట్విట్టర్లో తన ఆరోగ్య సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటానని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక తాను ప్రజల ఆశీర్వాదంతోనే ఆస్పత్రి నుంచి క్షేమంగా బయటకు వచ్చానని.. తన కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెల్పుతున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
आप सभी के आशीर्वाद और प्रार्थना के बल से मैं स्वास्थ्य लाभ कर अपने घर लौटा हूँ। सम्पूर्ण रूप से ठीक होने में और थोड़ा वक्त लगेगा। आप सभी को आपके आशीर्वाद के लिए मेरा दंडवत् प्रणाम?
— Sambit Patra (@sambitswaraj) June 9, 2020