నా ట్రస్ట్లో పిల్లలందరూ కరోనాను జయించారు.. థ్యాంక్స్: లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నిర్వహిస్తోన్న ట్రస్ట్లో 21 మంది కరోనా సోకిన విషయం తెలిసిందే. వారందరూ కరోనాను జయించారు. ఈ విషయాన్ని లారెన్స్ వెల్లడించారు. ట్రస్ట్లో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా ఉన్నట్లు ఇటీవల వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు వారందరూ కోలుకోవడంతో లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ”నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ […]
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ నిర్వహిస్తోన్న ట్రస్ట్లో 21 మంది కరోనా సోకిన విషయం తెలిసిందే. వారందరూ కరోనాను జయించారు. ఈ విషయాన్ని లారెన్స్ వెల్లడించారు. ట్రస్ట్లో 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కరోనా ఉన్నట్లు ఇటీవల వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు వారందరూ కోలుకోవడంతో లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ”నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. కరోనాను వాళ్లందరూ జయించారు, టెస్ట్ల్లో నెగిటివ్ రావడంతో వారిని తిరిగి ట్రస్ట్కి పంపారు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణి, మంత్రివర్యులు జి. ప్రకాశ్, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం” అని లారెన్స్ పోస్ట్ చేశారు.
Read this Story Also: ఏపీ సచివాలయంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో ఐదుగురికి పాజిటివ్.!
https://www.facebook.com/offllawrence/posts/2746598102119207