AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్తగా 1.15 లక్షల మందికి పెన్షన్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుకను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ (బుధవారం) 59.03 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు సర్వం సిద్దమైంది....

ఏపీలో కొత్తగా 1.15 లక్షల మందికి పెన్షన్
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2020 | 5:43 AM

Share

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుకను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ (బుధవారం) 59.03 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు సర్వం సిద్దమైంది. ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

జూలై నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.1442.21 కోట్లను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేసింది. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల చేతికే అందించనున్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులుగా జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసి అప్‌లోడ్ చేస్తారు. అలాగే లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన 3,364 మంది పెన్షనర్ల సొమ్మును వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లించనున్నారు.

అలాగే జిల్లాల పరిధిలో పెన్షన్ బదిలీ కోసం 18,533 మంది, ఇతర జిల్లాలకు తమ పెన్షన్ బదలీ చేయాలని 7,501 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అప్లికేషన్లను అధికారులు పరిశీలించి, వారికి కూడా ఆ మేరకు పెన్షన్ బదిలీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లలో 5,165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. పోర్టబులిటీ ద్వారా పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న 4,010 మంది పెన్షనర్లకు కూడా వారు కోరుకున్నప్రాంతంలోనే పింఛన్ ను అందించనున్నారు.

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?