లాక్డౌన్: టీఎస్ పోలీసుల న్యూ రూల్స్.. రేపట్నుంచి కఠినంగా అమలు
కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న వేళ.. లాక్డౌన్ను మే 7వ తేదీ వరకూ కొనసాగించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రాష్ట్రంలో న్యూ రూల్స్ తీసుకొచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి వాటిని రాష్ట్రంలో లాక్డౌన్ను..
కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న వేళ.. లాక్డౌన్ను మే 7వ తేదీ వరకూ కొనసాగించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా రాష్ట్రంలో న్యూ రూల్స్ తీసుకొచ్చారు. ఈ నెల 21వ తేదీ నుంచి వాటిని రాష్ట్రంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరా కోసం కొందరికి పాసులు ఇచ్చాం. అవసరం లేకుండా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. పాసులు ఉన్న వ్యక్తులు ఎక్కడ తిరగాలో ప్రదేశాలను గుర్తించామన్నారు.
New Rules:
-పాస్లు మిస్యూజ్ చేస్తే వాహనాలు సీజ్ -వాహనాలు సీజ్ చేసిన తర్వాత మరిన్ని కఠిన చర్యలు -ఎమర్జెన్సీ పాస్లను రివ్యూ చేస్తాం -వెళ్లాల్సిన రూట్, టైమింగ్స్లో కొత్త పాస్లు -ఉద్యోగులకు కలర్కోడ్తో పాస్లు -మూడు కిలో మీటర్ల లోపు మాత్రమే వెళ్లాలి -వాహనదారులు రెసిడెన్స్ ఫ్రూఫ్స్తోనే బయటకు రావాలి -ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పాసులు ఇస్తాం -కలర్కోడ్ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాస్ ఇవ్వాలి -అన్ని మతాల వారు ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలి -లక్షణాలు కనిపిస్తే సమీప ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి -ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ఫ్రూవ్స్ తీసుకు వెళ్లాలి -రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి
కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్డౌన్ పూర్తయ్యాక ఆ వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామన్నరు కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలని డీజీపీ స్పష్టం చేశారు.
Read More:
పవన్తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్
తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..
నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..