నగరంలో నాలుగిళ్లకు ఒకే టాయిలెట్..15 మందికి కరోనా!
ఓల్డ్ సిటీలోని జియాగుడ, మంగళ్హాట్ ప్రాంతాలు ఇప్పుడు కరోనాకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి.ఈ రెండు ప్రాంతాలూ హాట్స్పాట్లుగా మారాయి.
గ్రేటర్ హైదరాబాద్ను కరోనా వెంటాడుతోంది. తెలంగాణలోని జిల్లాల్లో వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మహానగరంలో మాత్రం మహమ్మారి ప్రతాపం చూపుతోంది. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులన్నీ దాదాపుగా హైదరాబాద్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఈ నెలలో 330కిపైగా కరోనా కేసులు నమోదు కాగా.. రాజధానిలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్యకి వెయ్యికి చేరువలో ఉంది. పాతబస్తీలోని జియాగుడ, కుల్సుంపురా, కార్వాన్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు.
ఓల్డ్ సిటీలోని జియాగుడ, మంగళ్హాట్ ప్రాంతాలు ఇప్పుడు కరోనాకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి.ఈ రెండు ప్రాంతాలూ హాట్స్పాట్లుగా మారాయి. ఇప్పటికే జియాగుడలో మొత్తం 90 కోవిడ్ కేసులు నమోదు కాగా.. నాలుగు రోజుల వ్యవధిలోనే 42 కేసులు నమోదయ్యాయి. మంగళ్హాట్ ఏరియాలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళ్ హాట్లోని కామటిపురా బస్తీలో మే 11న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అతడు నివసించే భవనంలో ఉన్న మరో నాలుగు కుటుంబాల వారికి టెస్ట్లు చేయగా..15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఈ నాలుగు కుటుంబాలు ఒకే బాత్రూమ్ను ఉపయోగించడమే వారందరికీ కరోనా సోకడానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.