మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. తాజా అప్డేట్స్‌ ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా..

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. తాజా అప్డేట్స్‌ ఇవే..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 9:09 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండగా.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 4,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,74,761కి చేరింది. ప్రస్తుతం 75,979 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. రోజు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆస్పత్రులన్నీ ఫుల్‌ అయ్యాయి. మరోవైపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికి వాడగా చెప్పుకునే ధారవిలో మాత్రం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఇక్కడ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా మంగళవారం నాడు ధారవిలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.