AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో కరోనా విజృంభణ గత 24 గంటల్లో 14,317 మందికి పాజిటివ్.. 57 మ‌ృతి

రోజువారీ కరోనా కేసుల నమోదు 14 వేలు దాటింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు కొత్తగా 14,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ 24 గంటల్లోనే 57 మంది మృతి..

మహారాష్ట్రలో కరోనా విజృంభణ గత 24 గంటల్లో 14,317 మందికి పాజిటివ్.. 57 మ‌ృతి
corona-virus
Sanjay Kasula
|

Updated on: Mar 12, 2021 | 7:47 AM

Share

మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో చాల దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.  గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

రోజువారీ కరోనా కేసుల నమోదు 14 వేలు దాటింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు కొత్తగా 14,317 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఈ 24 గంటల్లోనే 57 మంది మృతి చెందినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కోవడ్ కేసుల సంఖ్య 22,66,374కు, మర­ణాల సంఖ్య 52,667కు చేరింది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 7193 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,06,400కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,070 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. కరోనా తీవత్ర నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

లావుంటే .. కంద్ర ప్రభుత్వం మహారాష్ట్రతోపాటు మరో నాలు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని హెచ్చరించింది.దేశం వ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించింది . ఈ సందర్భంగా మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని  వెల్లడించింది. మహారాష్ట్రలో లక్షకుపైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయని పేర్కొంది. మధ్యప్రదేశ్​, గుజరాత్​, హరియాణాలోనూ అలాంటి పరిస్థితే ఉందని తెలిపింది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశమైనట్లు తెలిపింది. కేసుల పెరుగుదలకు ప్రధానంగా టెస్టులు, కేసుల ట్రేసింగ్ తగ్గించటం​, కొవిడ్​ పట్ల ప్రజల నిర్లక్ష్యం, పెద్ద ఎత్తున సమావేశాలే కారణమని అ ఐసీఎంఆర్​ డీజీ డాక్టర్​ బలరామ్​ భార్గవ తెలిపారు.

ఇవి కూడా చదవండి

Katas Raj Temple in Pakistan: పాకిస్తాన్‌లో పరమశివుడి ఆలయం.. దాయాది దేశంలో విరాజిల్లుతున్న భోళాశంకరుడు

AP Corona: ఏపీలో మెల్లగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. గత 24గంటల్లో భారీగా పెరిగిన కేసులు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..