మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం పది వేలకు పైగా పాజిటివ్ కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గురువారం నాడు రికార్డు స్థాయిలో 14వేలకు పైగా నమోదయ్యాయి. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లొ కొత్తగా మరో 14,492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,43,289కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 4,59,124 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,62,491 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 21,359 మంది మరణించారు. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ముంబై, థానే,పూణె నగరాల్లోనే నమోదవుతున్నాయి.
14,492 new #COVID19 cases, 12,243 recoveries & 326 deaths reported in Maharashtra today. Total number of COVID cases rises to 6,43,289 in the state, which includes 4,59,124 recovered cases, 1,62,491 active cases & 21,359 deaths till date: State Health Department, Maharashtra pic.twitter.com/QmEYAp1fh2
— ANI (@ANI) August 20, 2020
Read More :