ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం..

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 20, 2020 | 2:23 PM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ప్రారంభంలో రోజుకు పదుల సంఖ్యలో నమోదైన కేసులు ఆ తర్వాత వందల్లోకి చేరగా.. ఇప్పుడు నిత్యం వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,898 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,020కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 46,936 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22,651 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 8 మంది మరణించారని బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 380 మంది మరణించారు. మరో 53 మంది ఇతర వ్యాధుల బారినపడి మరణించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,15,947 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.