మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పోలీసు సిబ్బందిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిత్యం..

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 3:34 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పోలీసు సిబ్బందిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిత్యం వందల మంది సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 117 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడ్డ పోలీసు సిబ్బంది సంఖ్య 12,877కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 10,491 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,255 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 131 మంది పోలీసు సిబ్బంది మరణించారు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.