కల్లు దుకాణాలకు గ్రీన్ సిగ్నల్.. మద్యం అమ్మకాలపై నిషేధం..
దేశవ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. దీనితో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు తమ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు. ఇక తాజాగా కేరళ ప్రభుత్వం కొన్ని లాక్ డౌన్ మినహాయింపులకు ఆమోదం తెలిపింది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్లో టెన్షన్..) ఇందులో భాగంగానే కల్లు విక్రయాలకు […]
దేశవ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్రం పలు సడలింపులు ఇచ్చింది. దీనితో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు తమ రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు. ఇక తాజాగా కేరళ ప్రభుత్వం కొన్ని లాక్ డౌన్ మినహాయింపులకు ఆమోదం తెలిపింది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్లో టెన్షన్..)
ఇందులో భాగంగానే కల్లు విక్రయాలకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తింపు పొందిన అన్ని కల్లు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భౌతిక దూరం, మాస్క్ ధరించడం వంటి రూల్స్ ఖచ్చితంగా అని స్పష్టం చేసింది. కాగా, మద్యం అమ్మకాలకు మాత్రం అనుమతిచ్చేది లేదని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్డౌన్కు సిద్దంకండి..)
Read More: