మే17 తర్వాత దేశీయ విమానాలకు అనుమతి!
దేశవ్యాప్తంగా ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన జాగ్రత్తలు చేపడుతూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రేపటి నుంచి ప్రారంభిస్తున్న కేంద్రం.. మే 17 తర్వాత దేశీయంగా పలు విమాన సర్వీసులను కూడా పునరుద్దరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్లో టెన్షన్..) ఇందులో భాగంగానే పలు విమానయాన సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారం […]
దేశవ్యాప్తంగా ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన జాగ్రత్తలు చేపడుతూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను రేపటి నుంచి ప్రారంభిస్తున్న కేంద్రం.. మే 17 తర్వాత దేశీయంగా పలు విమాన సర్వీసులను కూడా పునరుద్దరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్లో టెన్షన్..)
ఇందులో భాగంగానే పలు విమానయాన సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నాయని.. విమానాల పునరుద్దరణకు అంతా సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయత వర్గాల సమాచారం. కాగా, దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 67,152 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2206 మంది మృత్యువాతపడ్డారు. అటు మహారాష్ట్ర, గుజరాత్లలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్డౌన్కు సిద్దంకండి..)
Read More:
నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్కు ప్రాణ సంకటం.!
హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!
#Breakingnews | Preparations on to resume domestic flight operations partially: Sources pic.twitter.com/KbUULp4Lfl
— NewsX (@NewsX) May 11, 2020