AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన బంగారు ఆభరణాల డిమాండ్

దేశంలో బంగారం డిమాండ్‌పైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది కరోనా వైరస్. భారత్‌లో బంగారు ఆభరణాల డిమాండ్ ఒక్కసారిగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. తొలి త్రైమాసికంలో పసిడి డిమాండ్ గతం కంటే 41 శాతం తగ్గి..

11 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన బంగారు ఆభరణాల డిమాండ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 12:58 PM

Share

దేశంలో బంగారం డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది కరోనా వైరస్. భారత్‌లో బంగారు ఆభరణాల డిమాండ్ ఒక్కసారిగా 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. తొలి త్రైమాసికంలో పసిడి డిమాండ్ గతం కంటే 41 శాతం తగ్గి 73.9 టన్నులకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే ఇది 41 శాతం తక్కువని ప్రపంచ బంగారు మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. అప్పటికే దేశీయంగా ఉన్న పసిడి ధరలు, కరెన్సీ క్షీణతపై కరోనా వైరస్ ప్రభావం పడటం వల్ల ఇలా జరిగిందని పేర్కొంది.

పెళ్లిళ్ల సీజన్‌తో తొలి త్రైమాసికంలోని తొలి విభాగంలో పసిడికి డిమాండ్ పెరిగింది. అయితే ఫిబ్రవరి మధ్య వారాల్లో స్థానికంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా కొనుగోలుదారులు బంగారం వైపు మొగ్గు చూపలేదు. ఆ తర్వాత అమలైన లాక్‌డైన్ వల్ల మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మార్చి నెలలో 60-80 శాతం మేర డిమాండ్ పడిపోయింది. క్యూ 1లో 10 గ్రాముల పసిడి ధర సగటున రూ. 41,124 ఉండగా.. మార్చిలో స్థానిక బంగారం ధర నూతన రికార్డులను సృష్టించి రూ.44,315కు చేరింది.

ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించింది. దీంతో నగరాల్లోని మధ్యతరగతి కొనుగోలుదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు బంగారు కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. కాగా రెండో త్రైమాసికంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Learn More: 

కరోనా లాక్‌డౌన్: వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్

హెలీకాఫ్టర్ మనీ.. క్రైసిస్‌కు పరిష్కారం కాదు.. అప్పులు చేయాల్సిందే!