Corona Test: డీఆర్​డీఓ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌… సెకన్లలోనే కరోనా టెస్ట్​… కచ్చితత్వం 96.73 శాతం

అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)....

Corona Test:  డీఆర్​డీఓ స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌... సెకన్లలోనే కరోనా టెస్ట్​... కచ్చితత్వం 96.73 శాతం
Coronavirus
Follow us

|

Updated on: May 08, 2021 | 2:07 PM

అనుమానిత రోగులలో కోవిడ్ -19 ను వేగంగా గుర్తించడంలో సహాయపడే రీసెర్చ్ లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) కోవిడ్ -19 ను గుర్తించడంలో సహాయపడటానికి ఒక కృత్రిమ మేధస్సు (AI) అల్గోరిథంను సృష్టించాయి. ఈ అల్గోరిథం ప్ర‌కారం చెస్ట్ ఎక్స్ రే తీయ‌డం ద్వారా ఈజీగా కోవిడ్ ను గుర్తించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. డెవలపర్ల తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, ఛాతీ ఎక్స్-రే స్క్రీనింగ్ కోసం ఉపయోగించిన ఆత్మన్ ఏఐ అనే సాధనం వైర‌స్ ను గుర్తిచ‌డంలో 96.73 శాతం ఖచ్చితత్వ రేటును చూపించింది. క‌రోనా రోగులను వేగంగా గుర్తించడానికి, సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడటానికి…. ఫ్రంట్‌లైన్‌లోని వైద్యులకు సహాయం చేయడానికి డీఆర్డీఓ.. ఈ డయాగ్నొస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేసింద‌ని ఆ సంస్థ‌ డైరెక్టర్ డాక్టర్ యూకే సింగ్ చెప్పారు.

ఎక్స్-రే ఉపయోగించి వైర‌స్ ను డిటెక్ట్ చేయ‌డం చాలా వేగ‌వంతమైన పని అని, తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని ఈ ప‌రిశోధ‌న చేసిన టీమ్ పేర్కొంది. సిటి స్కాన్లు అందుబాటులో లేని మన దేశంలోని చిన్న పట్టణాల్లో చాలా ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంద‌ని, ఇది రేడియాలజిస్టులపై భారాన్ని త‌గ్గిస్తుంద‌ని వారు చెబుతున్నారు. చెస్ట్ ఎక్స్-రే లోని ఏఐ సాధ‌నం ఉప‌యోగించి రోగిలో వ్యాధి వ్యాప్తి ఏ ద‌శ‌లో ఉందో గుర్తించ‌వ‌చ్చ‌ని.. దీని ద్వారా చికిత్స కూడా సుల‌భ‌త‌రం అవుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

కాగా దేశంలోని రేడియాలజిస్టుల డిజిటల్ నెట్‌వర్క్.. 5 సి నెట్‌వర్క్, హెచ్‌సిజి అకాడెమిక్స్ సహకారంతో దేశంలోని దాదాపు 1000 ఆసుపత్రులలో ఈ సాధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ సాంకేతిక ద్వారా కరోనాను కొన్ని సెకన్లలో కనుగోవచ్చని హెచ్​సీజీ అకాడమిక్స్​ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ టూల్​ ద్వారా ప్రస్తుతం ఆస్పత్రులలో సీటీ స్కాన్​ మెషీన్లపై పడుతున్న భారం కొంత తగ్గుతుందని హెచ్​సీజీ అకాడమిక్స్​ అభిప్రాయపడింది.

Also Read: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి దృష్టి లోపం, సూరత్ లో తలెత్తిన కొత్త ప్రమాదం, అధ్యయనం చేస్తున్న నిపుణులు

కడప జిల్లాల్లో ఘోర ప్రమాదం.. ముగ్గురాయి గనిలో జిలిటెన్‌ స్టిక్స్‌ పేలుడు.. 9 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు