Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు

కరోనా వైరస్ పుట్టుక, దాని విస్తరణ గురించి భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారి గురించి జరుగుతున్న చర్చలో ఆసక్తికర అంశాలు ‘డైలీ మెయిల్‌’ వార్తా సంస్థ బహిర్గతం చేసింది.

Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు
Covid 19 Virus Created In Wuhan Lab
Follow us

|

Updated on: May 31, 2021 | 2:55 PM

Covid-19 created in Wuhan lab: కరోనా వైరస్ పుట్టుక, దాని విస్తరణ గురించి భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారి గురించి జరుగుతున్న చర్చలో ఆసక్తికర అంశాలు ‘డైలీ మెయిల్‌’ వార్తా సంస్థ బహిర్గతం చేసింది. కరోనా వైరస్ పుట్టుక గురించి జరుగుతున్న చర్చలో ప్రపంచ దేశాలు నివ్వరపోయే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కరోనా వైరస్ సహజంగా పుట్టుకొచ్చింది కాదని, ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని ప్రముఖ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు.

కొత్త మహమ్మారుల నుంచి మానవ జాతిని రక్షించడానికి ఉద్దేశించిన సంజీవని లాంటి ప్రాజెక్టును చైనా దురుద్దేశంతో పక్కదారి పట్టించిందని స్పష్టమవుతోంది. కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో కావాలనే సృష్టించి.. పెను వినాశనానికి పూనుకున్న చైనా తప్పుడు పనిని బయటపెట్టేందుకు ప్రయత్నించిన నిజాయితీ గల శాస్త్రవేత్తలను మట్టిలో కలిపేసింది. అసలు విషయాన్ని ప్రపంచం పసిగడుతుందేమోనని కొత్త కథను రీ-క్రియేట్‌ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్‌ మూలలపై చర్చ కొనసాగుతున్న సమయంలో ప్రఖ్యాత బ్రిటిష్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టిస్తున్నది.

కరోనా వైరస్‌ దానికదే ప్రకృతిలో సహజంగా పుట్టలేదని, ఆ వైరస్‌ను చైనానే ల్యాబ్‌లో సృష్టించిందని బ్రిటన్‌ పత్రిక ‘డైలీ మెయిల్‌’ ఆదివారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ ఆంగస్‌ డాల్‌గ్లిశ్‌, నార్వే శాస్త్రవేత్త డాక్టర్‌ బిర్గర్‌ సోరెన్సెన్‌ సంయుక్తంగా జరిపిన పరిశోధన అంశాలను వెల్లడించింది. ఈ అధ్యయనం సైన్స్‌ పత్రిక ‘క్వార్టర్లీ రివ్యూ ఆఫ్‌ బయోఫిజిక్స్‌ డిస్కవరీ’లో త్వరలో ప్రచురితం కానుంది. అటు, నోబెల్ బహుమతి గ్రహిత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు.

చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్‌లో నిర్వహిస్తున్న ‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులో భాగంగా కరోనా వైరస్‌ను శాస్త్రవేత్తలు కృత్రిమంగా ఈ వైరస్‌ను సృష్టించారు. దీనికోసం తమ దేశంలోనే గుహల్లో ఉండే గబ్బిలాల్లోని కరోనా వైరస్‌ ప్రాథమిక స్పైక్‌ ప్రొటీన్‌ను ఆధారంగా తీసుకున్నారని తమ ప్రచురణలో పేర్కొన్నారు.

‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ను మానవ పరిణామక్రమాన్ని రక్షించడానికి ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టులుగా చెబుతారు. కొత్తగా వెలుగుచూసే వైరస్‌లు భవిష్యత్‌లో ఎలా పరిణామక్రమం చెందొచ్చు? ప్రమాదాలు, నివారణ మార్గాలపై ఈ ప్రాజెక్టుల్లో భాగంగా పరిశోధిస్తారు. దీని కోసం సహజంగా పుట్టిన వైరస్‌ శక్తిని కృత్రిమంగా పెంచుతారు. అయితే, ఈ ప్రాజెక్టులతో ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వీటిపై నిషేధం విధించారు. చైనా మాత్రం వీటిని కొనసాగించింది.

‘గెయిన్‌ ఆఫ్‌ ఫంక్షన్‌’ ప్రాజెక్టులను అత్యంత కట్టుదిట్టమైన ల్యాబ్‌లలో నిర్వహించాలి. వ్యాక్సిన్ల తయారీకి వాడే బయోసేఫ్టీ లెవల్‌ 2, 3 ల్యాబ్స్‌ వీటికి సరిపోవు. అయినప్పటికీ వూహాన్‌ ల్యాబ్‌లోని బయోసేఫ్టీ లెవల్‌ 3 విభాగంలో చైనా పరిశోధకులు కరోనాను కృత్రిమంగా సృష్టించడంతో వైరస్‌ లీక్‌ అయింది. అయితే, దీన్ని చైనా అధికారులు కావాలనే లీక్‌ చేశారన్న వాదనలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రయోగాలను వ్యతిరేకించిన ల్యాబ్‌లోని కొందరు శాస్త్రవేత్తలను చైనా అధికారులు బెదిరించారు. మాట వినని మరికొందరు కనిపించకుండాపోయారు.

లీకైన కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం అంచనాలకు మించడంతో చైనా ఆత్మరక్షణలో పడింది. దీంతోపాటు వైరస్‌ పుట్టుకపై ప్రపంచ దేశాలు ప్రశ్నలు లేవనెత్తడం, దర్యాప్తునకు ఒత్తిడి చేయడంతో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ‘రివర్స్‌-ఇంజినీరింగ్‌ (రెట్రో ఇంజినీరింగ్‌)’ సాంకేతికతతో కరోనా వైరస్‌ సహజంగానే ఏర్పడినట్టు నకిలీ ఆధారాలను సృష్టిద్దామని చైనా అధికారులు ప్రయత్నించారు. అందుకే తమదేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు బాధితుడిలో కనిపించిన వైరస్‌ నమూనాల సమాచారాన్ని కొంతకాలం విడుదల చేయలేదు. కొన్ని నెలల తర్వాత ఆ డేటాను విడుదల చేశారు. అయితే, అది కూడా అంత నమ్మశక్యంగా లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంకాలజీ ప్రొఫెసర్‌ అంగూస్‌ డాల్‌గ్లిశ్‌ హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ రూపకల్పనలో విశేష కృషి చేసిన వారిలో ఒకరు కాగా.. వైరాలజిస్ట్‌గా ఉన్న సోరెన్సెన్‌ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ‘బయోవాక్‌-19’ వ్యాక్సిన్‌ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రస్తుతం కరోనా వైరస్ పుట్టుకపై డాల్‌గ్లిశ్‌ ప్రత్యేక పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమం చైనా దుర్భుద్ధి మరోసారి బహిర్గతమైంది.

సహజంగా ఏర్పడిన వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లలో ఒకటి లేదా రెండు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఉంటాయి. అత్యంత అరుదుగా మూడు ఉండొచ్చు. అయితే, కరోనా స్పైక్‌ ప్రొటీన్‌లో నాలుగు అమైనో యాసిడ్‌లు ఉన్నాయి. సాధారణ వైరస్‌ను ల్యాబ్‌లో కృత్రిమంగా తీవ్రతరం చేస్తేనే నాలుగు పాజిటివ్‌ చార్జ్‌ అమైనో యాసిడ్‌లు ఏర్పడుతాయి. ఇవి మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మామూలు వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉంటుంది. కృత్రిమ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీని ఆధారంగా కరోనా వైరస్‌ను కృత్రిమంగా సృష్టించారని భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని నోబెల్ బహుమతి గ్రహిత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు. జంతువులు, వైరస్‌లపై గత నలభై సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నానని, కరోనా వైరస్ ఖచ్చితంగా సహజమైనది కాదని, ఇది ముమ్మాటికి తయారు చేయబడిందని, ఈ వైరస్ పూర్తిగా కృత్రిమంగా రూపొందించబడిందని డాక్టర్ తసుకు హోంజో చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు, డాక్టర్ తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవాన్ని కూడా వివరించారు. ఆ ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది అందరితో పరిచయం ఉందని, కరోనావైరస్ కనిపించిన తరువాత వారందరినీ తాను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా వారి ఫోన్‌లన్నీ గత మూడు, నాలుగు నెలలుగా స్పందించడం మానేసాయని చెప్పుకొచ్చారు. అంటే ఈ ల్యాబ్ లో పనిచేసిన టెక్నీషియన్లందరూ కరోనా వైరస్ బారిన పడి చనిపోయారని అర్థమవుతోందంటూ ఆయన సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

Read Also…  Anandaiah Medicine: ఆనందయ్య మందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..! ఆ మందుకు తప్ప..!

Latest Articles