AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ‌కు ఊర‌ట‌..25వేల మంది విడుద‌ల !

భార‌త్‌లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 8 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 500 వరకు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరో 600పైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 565 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇటు, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గానే ఉంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 49 కొత్త కేసులు […]

తెలంగాణ‌కు ఊర‌ట‌..25వేల మంది విడుద‌ల !
Jyothi Gadda
| Edited By: |

Updated on: Apr 09, 2020 | 3:28 PM

Share
భార‌త్‌లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 8 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 500 వరకు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరో 600పైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 565 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
ఇటు, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గానే ఉంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు ఏపీలో 348, తెలంగాణలో 453కి చేరుకున్నాయి. ఏపీలో 9 మంది, తెలంగాణలో 43 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. అలాగే రెండు రాష్ట్రాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కొత్తగా మరో 49 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, క‌రోనా నేప‌థ్యంలో వేల సంఖ్య‌లో అనుమానితుల్ని హోం క్వారంటైన్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే.
అయితే, వారిలో సుమారుగా 25 వేల మందిని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వీరంతా కూడా విదేశాల నుంచి వ‌చ్చిన వారే. క‌రోనా నేప‌థ్యంలో అంద‌రినీ రెండు వారాల హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని సూచించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ రోజుతో వాళ్ల‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లుగా అధికార వ‌ర్గాల స‌మాచారం. కేవ‌లం విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌నే కాకుండా వారిని క‌లిసిన వ్య‌క్తుల‌కు కూడా ఈ రోజుతో గ‌డువు ముగిసింది. వీరిలో ఎవ‌రికీ క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలింది. దీంతో వారివారి ఇళ్లకు అతికించిన కరోనా అలెర్ట్ స్టిక్కర్ల ను   తొలగించనున్నారు. వీరందరికి ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు శానిటైజర్లు అంద‌జేస్తారు. అలాగే ఈ రోజు నుండి వీరి ఇళ్లపై పోలీసు రెవెన్యూ అధికారుల నిఘా తొలగించనున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌టిష్టమైన చ‌ర్య‌ల ఫ‌లితంగానే రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే