AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమ్మడి కుటుంబంలో కరోనా కల్లోలం…12 మందికి పాజిటివ్‌

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు జిల్లాలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. తాజగా సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

ఉమ్మడి కుటుంబంలో కరోనా కల్లోలం...12 మందికి పాజిటివ్‌
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2020 | 9:50 PM

Share

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు జిల్లాలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. తాజగా సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ పట్టణంలో ఓ కుటుంబంలో 12 మందికి కరోనా సోకినట్లుగా శనివారం రోజున అధికారులు గుర్తించారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. వారి ఇంట్లో ఉంటున్న మిగతా వారందరూ కూడా అవే లక్షణాలతో బాధపడుతుండటంతో… కరోనా సోకిందనే అనుమానానికి వచ్చారు. శనివారం రోజున హైదరాబాద్ మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులు 14 మంది కరోనా టెస్టు చేయించుకున్నారు. కాగా, వారిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన కమిషనర్‌ సుజాత సిబ్బందితో వెళ్లి కాలనీలో రసాయనాలతో శుద్ధి చేయించారు. ఒకే కుటుంబంలో ఒకేసారి 12 మందికి కరోనా రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, సిద్దిపేట జిల్లాలో శనివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 174 కు చేరిందని అధికారులు తెలిపారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు