AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు

దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు

Phani CH
|

Updated on: Jan 24, 2026 | 1:33 PM

Share

విజయవాడ కనకదుర్గమ్మ పేరుతో సైబర్ నేరగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. అమ్మవారి చీరలు, ప్రత్యేక పూజల పేరుతో ఫోన్ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆలయ అధికారులు అప్రమత్తమై, దేవస్థానం నుంచి ఫోన్ కాల్స్ ద్వారా వివరాలు అడగరని స్పష్టం చేశారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ లేదా సమాచార కేంద్రం ద్వారా మాత్రమే సేవలను పొందాలని, నకిలీ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆలయాలను, భక్తులను సైతం వదలడం లేదు. దేవుని పేరు చెప్పి మోసాలకు పాల్పడమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ పేరుచెప్పుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఆలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ కాల్స్ చేసి అమ్మవారి పట్టు చీరలు ఇంటికి పంపిస్తామని భక్తుల పేరు గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం ఆలయ అధికారులకు తెలియడంతో అప్రమత్తమయ్యారు. దేవస్థానం నుంచి వస్తున్న ఫోన్‌ కాల్స్‌ గురించి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు భక్తులు. అలర్లయిన ఆలయ అధికారులు దేవస్థానం తరపున ఎవరు వ్యక్తిగతంగా ఫోన్ చేసి వివరాలు , చెల్లింపులు లేదా బ్యాంకు వివరాలు అడగరని, ఆలయ ఈవో శీనా నాయక్‌ స్పష్టంగా ప్రకటించారు. భక్తులు కావలసిన దర్శనం, ఆర్జిత సేవలు , ప్రత్యేక పూజలు వివరాలు దేశంలో ఉన్నా.. విదేశాలలో ఉన్నా కేవలం ఆలయ అధికారిక వెబ్సైట్ , సమాచార కేంద్రం లేదా మన మిత్ర వాట్సప్ సేవల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచనలు చేశారు. డబ్బులు చెల్లిస్తే అమ్మవారి చీరలు పంపిస్తామంటూ లేదా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెప్పే ఫోన్లు దేవస్థానం నుంచి రావని అవి పూర్తిగా సైబర్ మోసగాళ్ల ప్రయత్నమేనని ఈవో వెల్లడించారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతుండటంతో భక్తులకు అవగాహన కలిగించేందుకు ఆలయ ప్రాంగణంలో మైక్ ద్వారా తరచూ హెచ్చరికలు చేస్తున్నామని, సూచనల బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే అమ్మవారి దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్‌ కూడా దేవస్థానం అధికారిక వెబ్ సైట్ లోనే ఉంటుందని, ఫోన్ ద్వారా ఎలాంటి బుకింగ్ సదుపాయం లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు , బ్యాంకు ఖాతా వివరాలు , యూపీఐ లింకులు అడిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని భక్తులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వెంటనే పోలీసులకు లేదా దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు పై కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..

ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు

ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని

మేడారం జాతర ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్ రైడ్స్.. డిస్కౌంట్ కూడా..

ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..