AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

Coronavirus: చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడం.. ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుండటం చాలామంది ఈ కోవిడ్ 19ను చైనా సృష్టించిందని అంటుంటారు. బయో వార్‌లో భాగంగా చైనా ఈ వైరస్ ను పుట్టించిందని అనేక విమర్శలు వచ్చాయి. స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం దీన్ని చైనీస్ […]

కరోనా వైరస్ 'వాట్సప్ గ్రూప్'.. వర్మ పోస్ట్ వైరల్..
Ravi Kiran
|

Updated on: Mar 28, 2020 | 2:23 PM

Share

Coronavirus: చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడం.. ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుండటం చాలామంది ఈ కోవిడ్ 19ను చైనా సృష్టించిందని అంటుంటారు.

బయో వార్‌లో భాగంగా చైనా ఈ వైరస్ ను పుట్టించిందని అనేక విమర్శలు వచ్చాయి. స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం దీన్ని చైనీస్ వైరస్ అంటూ విమర్శలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను కుదేలు చేస్తున్న ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వవేలాది జోక్స్, మీమ్స్ వచ్చిపడుతున్నాయి. ఎవరికి వారు తమ క్రియేటివిటీని జోడించి సృజనత్మకతంగా చైనాను ఏకిపారేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయారు.

తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కరోనా వైరస్ పై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి అందరిని ఆకట్టుకున్నారు. ఆ పోస్ట్ అర్ధం ఏంటంటే.. చైనా ‘కోవిడ్ 19’ అనే గ్రూప్ ను క్రియేట్ చేసి.. అందులో ప్రపంచం మొత్తాన్ని యాడ్ చేసి తను ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు చైనా కుట్రపై విమర్శలు గుప్పిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ పోస్టుపై ఓ లుక్కేయండి.

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?