ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!
Coronavirus Outbreak: ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ మూడో దశ ప్రారంభంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 తర్వాత పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉండదని.. విజయవాడ, గుంటూరు లాంటి హాట్స్పాట్లలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. రానున్న రోజుల్లో సుమారు 3 లక్షల ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తామని.. అప్పుడే వైరస్ వ్యాప్తిపై అవగాహన వస్తుందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంటింటి సర్వేలో సుమారు 5 వేల […]
Coronavirus Outbreak: ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ మూడో దశ ప్రారంభంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 తర్వాత పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉండదని.. విజయవాడ, గుంటూరు లాంటి హాట్స్పాట్లలో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. రానున్న రోజుల్లో సుమారు 3 లక్షల ర్యాపిడ్ టెస్టులను నిర్వహిస్తామని.. అప్పుడే వైరస్ వ్యాప్తిపై అవగాహన వస్తుందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇంటింటి సర్వేలో సుమారు 5 వేల మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్న ఆయన.. విదేశాల నుంచి రాష్ట్రానికి 29 వేల మంది వచ్చారని తెలిపారు. అటు మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లు వెయ్యి మంది ఉన్నారన్నారు. అంతేకాక ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 280కు మర్కజ్ లింకులు ఉన్నాయన్నారు.
మరోవైపు కరోనా నియంత్రణలో భాగంగా 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్-95 మాస్క్లు సిద్ధం చేస్తున్నామన్నారు. అటు 40లక్షల గ్లోవ్స్, 12 లక్షల సర్జికల్ మాస్క్లు ఉన్నాయని.. అలాగే హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ 20 లక్షలు, అజిత్రోమైసిన్ 14 లక్షలు సిద్ధంగా ఉంచామని జవహర్ రెడ్డి అన్నారు.
For More News:
గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..
కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..
చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..
‘విక్రమ్వేద’ రీమేక్లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!
ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి
దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..
వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణయం.!
ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..
లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..