AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట

కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ప్రముఖ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చికిత్స అందించేందుకు తన ఇంటినే ఆస్పత్రిగా మార్చాలనకుంటున్నట్లు..

కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 26, 2020 | 1:21 PM

Share

చాప కింద నీరులాగా కరోనా వైరస్.. దేశ వ్యాప్తంగా ప్రబలుతోన్న విషయం తెలిసిందే. దీన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 500లకి పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే 11 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ప్రముఖ హీరో కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు చికిత్స అందించేందుకు తన ఇంటినే ఆస్పత్రిగా మార్చాలనకుంటున్నట్లు ప్రకటించారు. తన పార్టీ నేతలతో(మక్కల్ నీది మయ్యం) కలిసి వైద్యులతో మాట్లాడి, మార్చాలనకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు సేవలు అందించేందుకు ఇదే మార్గమని భావిస్తున్నట్టు తెలిపారు.

కాగా మరోవైపు షూటింగులు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమలోని పేద కళాకారులను ఆదుకునేందుకు కమల్ రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించగా, రజనీకాంత్ ఇప్పటికే రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే ధనుష్ రూ.15 లక్షలు, డైరెక్టర్ శంకర్ రూ.10 లక్షలు, విజయ్‌ సేతుపతి రూ.10 లక్షలు, శివ కార్తికేయన్ రూ.10 లక్షలతో పాటు 100 బస్తాల బియ్యం, నిర్మాత దిల్లీ బాబు 20 బస్తాల బియ్యం చొప్పున విరాళంగా అందించారు. అలాగే నటుడు మనీష్ కాంత్ 40 కిలోల పప్పుదినుసులు, తమిళ సినిమా జర్నలిస్టు డైలీస్ అసోసియేషన్ తరుపున 100 కిలోల బియ్యం చొప్పున అందజేశారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!

తన కారును ఆపినందుకు యువతి హల్‌చల్.. పోలీసులను కొరికి.. రక్తం మీద ఊసి..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..