కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..
కరోనా ఎఫెక్ట్తో.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 21 రోజులూ దేశాన్ని లాక్డౌన్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. ఏప్రిల్ 14వ తేదీవరకూ ప్రజలు ఇళ్లు దాటి బయటకు..
కరోనా ఎఫెక్ట్తో.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 21 రోజులూ దేశాన్ని లాక్డౌన్ చేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో.. ఏప్రిల్ 14వ తేదీవరకూ ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావడానికి ఛాన్స్ లేదు. కేవలం అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు రావాలని పేర్కొన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే రాష్ట్రాన్ని లాక్డౌన్ చేశారు సీఎం కేసీఆర్. ఇళ్ల నుంచి ప్రజలను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన పనులు ఉన్నవారిని మాత్రమే బయటకు రావాలని పేర్కొన్నారు. అందులోనూ ఇప్పుడు తెలంగాణలో 39కి కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల పట్ల మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కేసీఆర్.
కాగా తెలంగాణలో కరోనా వైరస్.. కట్టడికి ఇప్పటికే లాక్డౌన్ను అమలు చేస్తుండగా.. తాజాగా స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అగ్నిమాపక శాఖ సహాయంతో సోడియం హైపో క్లోరైడ్ను బహిరంగ ప్రదేశాల్లో చల్లుతూ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చింది. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ దీన్ని చేపట్టింది. కాగా జీహెచ్ఎంసీ పరిధిలోని గత కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం నడుస్తోంది.
ఇవి కూడా చదవండి: బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్
లాక్డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..
వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..
కరోనా అలెర్ట్: కొత్తవారు ఇంటికొస్తే వెయ్యి జరిమానా
సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.10 లక్షలు ప్రకటించిన చంద్రబాబు
పోలీస్ ఆఫీసర్పై కరోనా కేసు నమోదు.. తన కొడుకుకి కరోనా ఉందని చెప్పనందుకు..
ఫ్లాష్ న్యూస్: విశాఖలో మరో మూడు కరోనా కేసులు