AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా పాజిటివ్

కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. వారు వీరు అని తేడా లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కొవిడ్ సోకింది...

ఏపీ హైకోర్టు సిబ్బందికి కరోనా పాజిటివ్
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2020 | 5:44 AM

Share

కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. వారు వీరు అని తేడా లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కొవిడ్ సోకింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు బుధవారం హైకోర్టు కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు.

చీఫ్‌ జస్టీస్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. హైకోర్టు పరిధిలోని అన్ని దిగువ కోర్టుల్లో కూడా కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర పిటిషన్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.