AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న వెజిటేబుల్స్ ధరలు

ఇప్పుడు ఈ ప్రభావం కాస్తా కూరగాయల మీద పడింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలడంతో.. ప్రజలందరూ నాన్ వెజ్ తినడం మానేశారు. అందులోనూ ముఖ్యంగా చికెన్ జోలికి వెళ్లడమే లేదు. దీంతో.. చికెన్ తింటే కరోనా రాదని..

ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న వెజిటేబుల్స్ ధరలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2020 | 6:56 PM

Share

దేశ వ్యాప్తంగా రోజురోజుకీ మరింతగా విజృంభిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 176 కేసులు నమోదయ్యాయి. అలాగే గురువారం కరోనా వైరస్‌తో పంజాబ్‌కి చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు కీలక సూచనలు కూడా జారీ చేశారు. అలాగే.. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కల్పించారు అధికారులు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీలు, థియేటర్లు, మాల్స్, షాపింగ్ మాల్స్‌ అన్నింటినీ మూసివేశారు.

అయితే ఇప్పుడు ఈ ప్రభావం కాస్తా కూరగాయల మీద పడింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలడంతో.. ప్రజలందరూ నాన్ వెజ్ తినడం మానేశారు. అందులోనూ ముఖ్యంగా చికెన్ జోలికి వెళ్లడమే లేదు. దీంతో.. చికెన్ తింటే కరోనా రాదని.. ఫ్రీగా ఇంటింటికి కోడి మాంసాన్ని పంచుతున్నారు కూడా. ఈ భయంలో అందరూ కూరగాయల వినియోగం భారీగా పెరిగింది. ఇదే అదునుగా భావించిన.. కూరగాయల దుకాణాదారులు ధరలను పెంచేశారు. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగదని అనే వారు ఇప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు.

కాగా మరోవైపు కూరగాయల దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. ఇది కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. కేవలం టమాటా, ఉల్లి పాయల ధరలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. మిగిలిన కూరగాయల ధరలు కిలో రూ.50ల పైననే పలుకుతున్నాయి. అందులోనూ ఇప్పుడు భారత్‌లోనూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్నింటినీ బంద్ చేస్తున్నారు. ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే.. కూరగాయల ధరలు కిలో రూ.100లు అయినా ఆశ్చర్యం లేనక్కర్లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.

Read More this also:

 జబర్దస్త్ నుంచి బయటకు పంపించేస్తే.. నేను ఇది చేయడానికి సిద్ధం

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..